సీఎం ప్రజావాణిలో 345 దరఖాస్తులు
HYD: బేగంపేట్ ప్రజాభవన్లో మంగళవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో 345 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 127, రెవెన్యూ శాఖకు 50, ఇందిరమ్మ ఇళ్ల కోసం 90, ప్రవాసి ప్రజావాణికి 01 దరఖాస్తులు రాగా ఇతర శాఖలకు సంబంధించి 77 దరఖాస్తులు అందాయని సీఎం ప్రజావాణి ఇంఛార్జ్ జి.చిన్నారెడ్డి వెల్లడించారు.