‘చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి’

NLG: చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కట్టంగూరు ఎస్సై మునుగోటి రవీందర్ తెలిపారు. మండలంలోని మల్లారం గ్రామంలో సోమవారం పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ కుమార్రెడ్డి, తహశీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ భాగ్య, పంచాయతీ కార్యదర్శి, రెవెన్యూ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.