VIDEO: సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ
KNR: 'ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక' ద్వారా డివిజన్లను అభివృద్ధి చేయనున్నామని నగర మేయర్ శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ 13వ డివిజన్ మార్కండేయ నగర్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మేయర్ సుమారు రూ.10 లక్షల నిధులతో చేపట్టే సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. డివిజన్లో సమస్యలను పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.