పదవ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం
TPT: జిల్లా వ్యాప్తంగా మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరుగనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. 31,334 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని విద్యాశాఖాధికారి కుమార్ తెలిపారు. పరీక్షల నిర్వహణ కోసం 165 కేంద్రాలు, 62 జోన్లు, 1,435 ఇన్విజిలేటర్లు, 179 చీఫ్ సూపరింటెండెంట్లు, 179 డిపార్ట్మెంటల్ అధికారులను ఏర్పాట్లు చేశారు.