'తగరపువలస బస్ కాంప్లెక్స్కు చర్యలు'
VSP: తగరపువలస బస్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం ఆర్టీసీ ఆర్.ఎం అప్పలనాయుడితో కలిసి కాంప్లెక్స్ కోసం కేటాయించిన 4 ఎకరాల భూమిని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంప్లెక్స్తో పాటు వాణిజ్య అవసరాల దృష్ట్యా మాల్ను కూడా నిర్మించనున్నట్లు చెప్పారు.