సీబీజీ ప్లాంట్కు మంత్రి సంధ్యారాణి శంకుస్థాపన
AP: విజయనగరంలోని వంగరం మండలం అరసాడలో CBG ప్లాంట్కు మంత్రి సంధ్యారాణి శంకుస్థాపన చేశారు. రూ.102 కోట్లతో ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు. కార్బన్ ఉద్గారాలను సున్నా స్థాయికి తేవడమే లక్ష్యంగా సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తిని చేపడతామన్నారు. ఇందులో భాగంగా కంప్రెస్డ్ బయో గ్యాస్ (CBG)కు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని చెప్పారు.