ఈ నెల 24న DY.CM పవన్ కళ్యాణ్ పర్యటన
W.G: ఈ నెల 24న ద్వారకాతిరుమలలో DY.CM పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఐ.ఎస్. జగన్నాధపురం లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారని పోలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు శనివారం తెలిపారు. ఆయన తన క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ.. DY.CM పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.