నేడు కావూరి సాంబశివరావు అంత్యక్రియలు
HYD: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు నిన్న కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలు ఈ రోజు జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. బంజారాహిల్స్లోని ఆయన నివాసంలో పార్థివదేహాన్ని ఉంచారు. మధ్యాహ్నం 12 గంటలకు కావూరి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.