విషాదం.. లారీ కిందపడి బాలుడు మృతి
TG: రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మట్టి లారీ కింద పడి బాలుడు మృతి చెందిన ఘటన రాజేంద్రనగర్ మైలార్దేవ్పల్లిలో జరిగింది. సయ్యద్ రియాన్ ఉద్దీన్ అనే బాలుడు ప్రమాదవశాత్తూ మట్టి లారీ కింద పడి దుర్మరణం పాలయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.