ఈనెల 11న సంగారెడ్డిలో ప్రజావాణి

సంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ఈనెల 11న ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య శనివారం తెలిపారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు జిల్లా అధికారులు ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలు స్వీకరిస్తారని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.