మల్లన్న స్వామి మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

మల్లన్న స్వామి మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

JGL: ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలో జరుగుతున్న మల్లన్న స్వామి జాతర మహోత్సవంలో కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లన్న స్వామి ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు పూలమాలతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.