మృతుల కుటుంబాలకు పరిహారం అందజేత
JGL: గత ఆగస్టులో మహారాష్ట్రలో భారీ వరదల్లో చిక్కుకుని మరణించిన జగిత్యాల పట్టణంలోని టీఆర్ నగర్కి చెందిన హసీనా బేగం, ఆఫ్రినా, సమీనా కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున నష్ట పరిహారం మంజూరు చేసింది. ఈ పరిహారాన్ని మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ బాధిత కుటుంబాలకు ప్రొసీడింగ్ పత్రాలు అందజేశారు.