రాయలసీమకు తీరని ద్రోహం: తలారి రంగయ్య
ATP: రాయలసీమ నీళ్లు, నిధుల కోసం ప్రతి ఒక్కరూ రోడ్డెక్కి పోరాడాలని అనంతపురం మాజీ ఎంపీ, వైసీపీ నేత తలారి రంగయ్య పిలుపునిచ్చారు. నంద్యాలలో జరిగిన సాగునీటి ప్రాజెక్టుల సమాలోచన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి సీమ అభివృద్ధిపై మనసు లేదని విమర్శించారు. ఎయిమ్స్, హైకోర్టులను తరలించి ఈ ప్రాంతానికి ద్రోహం చేశారని మండిపడ్డారు.