రామచంద్రపురంలో మంత్రి విజయోత్సవ ర్యాలీ
కోనసీమ: రామచంద్రపురంలో గురువారం రాత్రి మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో అమరావతి విజయోత్సవ ర్యాలీ ఘనంగా జరిగింది. అమరావతిని శాశ్వత రాజధానిగా పార్లమెంటు గుర్తించడం శుభసూచికమని మంత్రి పేర్కొన్నారు. CM చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృషి, ప్రధాని మోదీ చొరవతోనే ప్రజల కల సాకారమైందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు.