945 గ్రాముల గంజాయి స్వాధీనం

945 గ్రాముల గంజాయి స్వాధీనం

TPT: గాజుల మండ్యం ఇండస్ట్రియల్ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ మంజునాథ్ రెడ్డి మాట్లడుతూ.. బీహార్‌కు చెందిన గజేంద్ర రాయ్ వద్ద నుంచి 945 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. తిరుపతిలో కొనుగోలు చేసి అత్తూరు పరిసరాల్లో విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితుడిని రిమాండ్‌కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.