నేడు జిల్లాలో PGRS కార్యక్రమం
NDL: జిల్లాలోని కలెక్టరేట్తో పాటు మండల, డివిజన్ కేంద్రాల కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నంద్యాల కలెక్టర్ రాజకుమారి ఆదివారం తెలిపారు. ప్రజలు తమ అర్జీలను ప్రత్యక్షంగా ఇవ్వవచ్చన్నారు. లేదా ఆన్లైన్లో mekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా సమర్పిచవచ్చని సూచించారు.