'మహిళలను పార్లమెంట్ సాక్షిగా BJP అవమానించింది'
HYD: మహిళలను పార్లమెంట్ సాక్షిగా బీజేపీ అవమానించిందని రాష్ట్ర మహిళా కార్పొరేషన్ ఛైర్మన్ శోభారాణి అన్నారు. గాంధీ భవన్లో ఆమె మాట్లాడుతూ.. బీజేపీ ఆలోచన ఒకలా ఉంది, ప్రవర్తన ఇంకోలా ఉందని, మహిళా బిల్లు కొత్తగా తీసుకురావాల్సిన అవసరం లేదని తెలిపారు. డీలిమిటేషన్ మహిళా బిల్లుకు సంబంధం ఏంటి? అని ప్రశ్నించారు. భారతదేశ మహిళలకు బీజేపీ క్షమాపణ చెప్పాలని పేర్కొన్నారు.