విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం రూ.1.72 లక్షలు

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో శనివారం స్వామివారికి భక్తులు చేసిన సేవలు ద్వారా రూ.1,72,253 ఆదాయం లభించిందని ఆలయ ఈవో అల్లు వెంకట దుర్గా భవాని తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 232 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 14 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారు అని, 1800 మంది అన్న ప్రసాదం స్వీకరించారని అన్నారు.