'వారసత్వ సంపదను కాపాడుకుందాం'
ATP: అనంతపురం నగరంలో గురువారం రాష్ట్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో హెరిటేజ్ వాక్ ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ ఆదేశాల మేరకు చారిత్రక కట్టడాల పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ఈ యాత్ర నిర్వహించారు. ఆర్ట్స్ కాలేజీ నుంచి పీస్ మెమోరియల్ హాల్ వరకు సాగిన ఈ కార్యక్రమంలో పురావస్తు శాఖ సహాయ సంచాలకులు స్వామినాయక్ పాల్గొని ప్రసంగించారు.