జిల్లాలో ఘనంగా సైన్స్ వారోత్సవాలు: డీఈవో
కోనసీమ: విద్యాశాఖ ఆధ్వర్యంలో సైన్స్ వారోత్సవాలు జిల్లాలో ఘనంగా జరుగుతున్నాయని డీఈవో నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. బుధవారం ఉదయం 9:30 గంటలకు 6, 7, 8 తరగతుల విద్యార్థులకు ఆన్లైన్ క్విజ్ పోటీలు నిర్వహించనున్నామని, 22 మండలాల నుంచి ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల జట్లు ఇందులో పాల్గొంటాయన్నారు. 6 టీమ్లు ఫైనల్స్ ఎంపిక అవుతాయన్నారు.