'వ్యక్తిగత శుభ్రతతో పాటు పట్టణ పరిశుభ్రతను కాపాడాలి'
SDPT: హుస్నాబాద్ పట్టణంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 5వ వార్డులో చైర్పర్సన్ దండి లక్ష్మి ఆధ్వర్యంలో చెత్త విభజనపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. పట్టణ ప్రజలందరూ వ్యక్తిగత శుభ్రతతో పాటు పట్టణ పరిశుభ్రతను కాపాడాలని సూచించారు. చెత్తను వేరుచేసి పురపాలక సంఘ వాహనానికి అందించాలని కోరారు.