రేపు బాడంగిలో ప్రజా దర్బారు: ఎమ్మెల్యే
VZM: బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన శుక్రవారం బాడంగి MPDO కార్యాలయంలో ప్రజా దర్చార్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇవాళ ఆయన మాట్లాడుతూ.. బాడంగి మండల కేంద్రం, గ్రామీణ ప్రాంత ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతులు స్వీకరించనున్నట్లు చెప్పారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని, సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.