రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
ఏలూరు రైల్వే స్టేషన్ పరిధిలోని ఏపూరు వంతెన వద్ద నిన్న సాయంత్రం రైలు ఢీకొని సుమారు 50-55 ఏళ్ల వయసు గల గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వివరాలు లభించకపోవడంతో రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యక్తి గురించి సమాచారం తెలిసినవారు హెచ్సీ ప్రసాద్ (ఫోన్: 9989109912)కు తెలియజేయాలని పోలీసులు కోరారు.