పత్తి రైతులు అఖిలపక్ష నాయకులు ధర్నా

పత్తి రైతులు అఖిలపక్ష నాయకులు ధర్నా

SRD:మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద పత్తి రైతులు, అఖిలపక్ష నాయకులు రోడ్డుపై బైఠాయించి నేడు ధర్నాకు దిగారు. తెలంగాణ రైతంగానికి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ, CMD లలిత్ కుమార్ గుప్తా పత్తి పంటకు విధిస్తున్న ఆంక్షల పట్ల నిరసన వ్యక్తం చేశారు. సీసీఐ ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.