మీడియాపై దాడిని ఖండించిన కేంద్రమంత్రి
SKLM: మీడియా సంస్థలపై భౌతిక దాడులు చేయడం ద్వారా వైసీపీ తన అరాచక స్వభావాన్ని బహిర్గతం చేసిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. హైదరాబాద్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ చేసిన దారుణ దాడిని ఆయన ఖండించారు. ప్రశ్నలు చేస్తే దాడులు చేస్తారా? దౌర్జన్యాలకు దిగుతారా? అని కేంద్ర మంత్రి ప్రశ్నించారు.