VIDEO: ప్రమాదసూచికల కోసం ఫ్లైఓవర్ బ్రిడ్జి రైలింగ్స్కు రంగులు

ప్రకాశం: ఒంగోలు నగర పరిధిలోని తూర్పు బైపాస్లో కిమ్స్ ఆసుపత్రి వద్ద ఉన్న ఫ్లైఓవర్ వంతెన రెయిలింగ్స్ రంగులతో ముస్తాబవుతున్నాయి. ఇటీవల కాలంలో రైలింగ్ గోడలన్నీ ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ కళావిహీనంగా తయారయ్యాయి. అంతేగాక వాహనాలకు ప్రమాద సూచికలు కూడా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో జాతీయ రహదారి అధికారులు వంతెన రైలింగులకు నలుపు తెలుపు రంగులను వేయిస్తున్నారు.