కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక శిబిరం
SRD: క్లెయిమ్ చేసుకొని ఆస్తుల కోసం ఈ నెల 20వ తేదీన కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రావిణ్య గురువారం ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటలకు ఈ శిబిరం జరుగుతుందని చెప్పారు. బ్యాంకుల్లో 10 సంవత్సరాలకు క్లెయిమ్ చేసుకోని వివరాల కోసం వెబ్సైట్ https://udgam.rbi.org.in ద్వారా తెలుసుకోవచ్చని వెల్లడించారు.