ఐకేపీ కేంద్రాల్లో భారీగా ధాన్యం నిల్వలు
NLG: నాగార్జునసాగర్ పరిధిలోని సుమారు 100కు పైగా ఐకేపీ కేంద్రాల్లో లక్ష క్వింటాళ్ల వరకు యాసంగి ధాన్యం నిల్వలు భారీగా పేరుకుపోయాయి. వారం రోజులుగా రైతులు కొనుగోళ్ల కోసం వేచి ఉన్నా ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. ఎండలు, అకాల వర్షాల భయంతో రైతులు టెన్షన్ పడుతున్నారు. వెంటనే తూకాలు వేసి కొనుగోళ్లు ప్రారంభించాలని రైతులు అధికారులను కోరుతున్నారు.