ఏకగ్రీవమైనా.. ఎన్నికలైనా ఆమెదే పైచేయి
MDK: టేక్మాల్(మ)లోని చంద్రు తండా గ్రామ ప్రజలు 2019 పంచాయతీ ఎన్నికల్లో స్రవంతిని ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నుకున్నారు. అయితే ఈసారి ఆమెకు పోటీగా ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ వేయడంతో పోలింగ్ నిర్వహించారు. ఈ పోలింగ్లోను ఆమె 210 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రెండో సారి కూడా తనకు సర్పంచ్గా ఆవకాశం ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.