పీహెచ్సీని తనిఖీ చేసిన DMHO
BPT: చీరాల మండలంలోని ఏపురుపాలెం పీహెచ్సీని DMHO డాక్టర్ ఎస్.విజయమ్మ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఈహెచ్ఆర్, ఏబీహెచ్ఏ ఐడీలు, ఆర్సీహెచ్ సేవలు, హెచ్పీవీ వ్యాక్సినేషన్, ప్రయోగశాల సేవల పనితీరును పరిశీలించారు. డేటా ఎంట్రీ ఖచ్చితత్వం, రికార్డుల నిర్వహణ, నివేదికలను సకాలంలో అప్డేట్ చేయాలని సిబ్బందికి సూచించారు.