నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు
AP: తిరుపతి శివారులో తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ పంచమి తీర్థంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఈ మేరకు అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లను చేశారు. 50 వేల మంది భక్తులు వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. దాదాపు 150 అన్నప్రసాదం కౌంటర్లను ఏర్పాటు చేసింది.