రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు: ఎస్సై
SRPT: స్థానిక ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని నేరేడుచర్ల మండలం ఎస్సై రవీందర్ నాయక్ హెచ్చరించారు. ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా దుష్ప్రచారం చేసేవారిపై నిఘా ఉంచామన్నారు. అంతేకాకుండా, గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.