పేకాట స్థావరాలపై పోలీసుల మెరుపు దాడి

పేకాట స్థావరాలపై పోలీసుల మెరుపు దాడి

సత్యసాయి: పుట్టపర్తి పరిధిలోని కర్ణాటక నాగేపల్లి అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్న స్థావరాలపై పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. పక్కా సమాచారంతో వెళ్లిన పోలీసులు ఏడుగురిని అరెస్టు చేసి, వారి నుంచి రూ.8,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. పుట్టపర్తి రూరల్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై క్రాంతి కుమార్ హెచ్చరించారు.