అసమానతలకు వ్యతిరేకంగా విద్యార్థుల ఉద్యమం
WNP: విజయవాడలో జరిగిన PDSU ప్రథమ జాతీయ మహాసభల్లో సమాజంలో పెరుగుతున్న అసమానతలకు వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించాలని వక్తలు పిలుపునిచ్చారు. కవి లక్ష్మీనరసయ్య మాట్లాడుతూ.. విద్య వ్యాపారీకరణ, వివక్ష పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నూతన విద్యా విధానంపై అశోక్, రమేష్ పట్నాయక్ తదితరులు ప్రసంగించగా, పలు రాష్ట్రాల విద్యార్థి ప్రతినిధులు పాల్గొన్నారు.