'కార్మికులకు వ్యతిరేకంగా చట్టాలు'
W.G: భీమవరం అంబేద్కర్ చౌక్లో బుధవారం కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర పాలకులు కార్పొరేట్లకు లక్షల కోట్ల రాయితీలు ఇస్తూ, రైతులు, కార్మికులు, కౌలు రైతుల హక్కులను, చట్టాలను తొలగిస్తున్నారని సీఐటీయూ అధ్యక్షుడు గోపాలన్ విమర్శించారు. ప్రభుత్వం తీసుకువస్తున్న చట్టాలు కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయని అన్నారు.