వలసపాకలలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

వలసపాకలలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

కాకినాడ రూరల్ వలసపాకలలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని మంగళవారం స్థానికులు పట్టుకున్నారు. పట్టపగలే పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్నా పౌరసరఫరాల శాఖ పట్టించుకోవట్లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. వారే వాహనాన్ని అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. సర్పవరం పోలీసులు వాహనాన్ని స్టేషన్కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.