గొర్రెల కాపరుల సమస్యలపై దేవేంద్రప్ప భరోసా
KRNL: కూడేరు వద్ద ఆదోనికి చెందిన కురువ కార్పొరేషన్ ఛైర్మన్ దేవేంద్రప్ప గొర్రెల కాపరులతో ఇవాళ సమావేశమయ్యారు. ఎండాకాలంలో మేత, నీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని కాపరులు వివరించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుని సీఎంకు తెలియజేస్తానని హామీ ఇచ్చారు. దళారుల దోపిడీ, మృగాల బెడదపై కూడా స్పందించి ప్రభుత్వం సబ్సిడీ పథకాలు అందిస్తోందన్నారు.