అతిరుద్ర హోమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
KRNL: శ్రీ కృష్ణ కాలచక్రం 87వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం సందర్భంగా ఎమ్మిగనూరు వీవర్స్ కాలనీ మైదానంలో యజ్ఞశాల నిర్వహిస్తున్న అతిరుద్ర హోమంలో 8వ రోజు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి పాల్గొన్నారు. 14 రోజుల పాటు జరిగే ఈ మహా యజ్ఞంలో భాగంగా గణపతి లక్ష్మీ, గణపతి సుదర్శన నవగ్రహ హోమాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు తీసుకున్నట్లు తెలిపారు.