VIDEO: మొక్కజొన్న కొనుగోళ్లపై బీఆర్ఎస్ ధర్నా
JN: స్టేషన్ ఘన్పూర్ పట్టణంలో వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. రైతులకు న్యాయం చేయాలని, వెంటనే కొనుగోళ్లు ప్రారంభించి దళారుల దందాను అరికట్టాలని నాయకులు డిమాండ్ చేశారు. రైతులను తక్కువ ధరలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి కల్పిస్తున్నారని విమర్శించారు.