ఘనంగా పోలమాంబ అమ్మవారి జాతర
విశాఖ జీవీఎంసీ 9వ వార్డు పెదగదిలి, పందుల ఫారం గ్రామాల్లో శ్రీశ్రీశ్రీ పోలమాంబ అమ్మవారి జాతర మహోత్సవాలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఆలయ కమిటీ సభ్యులు మాజీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి శ్రీనివాస్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, వేదపండితులతో ఆశీర్వాదం అందజేశారు.