యాదగిరిగుట్ట దేవస్థానం నేటి ఆదాయ వివరాలు
BHNG: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి నిత్యఖజానాకు సోమవారం రూ. 35,18,704 ఆదాయం సమకూరినట్లు ఈవో భవాని శంకర్ తెలిపారు. ప్రధానంగా ప్రసాద వితరణ విరాళాల ద్వారా రూ. 14,16,000, ప్రసాద విక్రయాలతో రూ. 7,24,950, VIP దర్శనాల ద్వారా రూ. 3,58,900 ఆదాయం వచ్చింది. అలాగే కార్ పార్కింగ్, బ్రేక్ దర్శనాలు, వ్రతాలు, ఇతర సేవల ద్వారా మిగిలిన మొత్తాన్ని భక్తులు సమర్పించుకున్నారు.