ప్రధాన హోటల్ బుకింగ్స్ పేరుతో మోసం

ప్రధాన హోటల్ బుకింగ్స్ పేరుతో మోసం

VZM: ప్రఖ్యాత హోటళ్ల పేర్లతో నకిలీ వెబ్‌సైట్‌లు సృష్టించి ఈ బుకింగ్స్ పేరుతో మోసం చేస్తున్న ముఠా ప్రధాన నిందితుడిని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీకి చెందిన యతేంద్ర జటావ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా మోసం వెలుగులోకి వచ్చింది. అతని వద్ద నుంచి కంప్యూటర్లు, సాంకేతిక పరికరాలు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.