బైక్ చోరీకి పాల్పడిన ఇద్దరు అరెస్ట్
JGL: బైక్ చోరీకి పాల్పడిన నిర్మల్కు చెందిన మహమ్మద్ సఫ్టర్ అలీఖాన్, మరో మైనర్ బాలుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై కిరణ్ కుమార్ మంగళవారం తెలిపారు. మెట్పల్లికి చెందిన పర్వేజ్ అహ్మద్ తన ఇంటి ముందు బైక్ను పార్కు చేసి ఉంచగా, ఆ బైక్ను వారు చోరీ చేసినట్లు గుర్తించామన్నారు. బైక్ను స్వాధీనం చేసుకొని, తదుపరి విచారణ నిమిత్తం మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు.