పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి: కలెక్టర్
PPM: స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, గత ఏడాది కంటే మెరుగైన స్కోరు సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి పురపాలక కమిషనర్లను ఆదేశించారు. శుక్రవారం ఆయన ఛాంబర్లో స్వచ్ఛ సర్వేక్షణ్, పట్టణ సుందరీకరణ, పారిశుధ్య పనులపై వీడియో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పురపాలక కమిషనర్ ఉన్నారు.