ఉగ్ర లింకు కేసులో మరో వ్యక్తి అరెస్ట్
NTR: విజయవాడ ఉగ్ర లింకు కేసులో మరో వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. హైదరాబాద్కు చెందిన సయిదా బేగం కీ రోల్ ప్లే చేసి, యువకులను తీవ్రవాద సంస్థల వైపు మళ్లించి కీలకంగా వ్యవహరించింది. దీంతో ఆమెను అరెస్టు చేసి విజయవాడ టూ టౌన్ PSలో విచారిస్తున్నారు. కాగా, ఈ విచారణలో రోజుకో కీలక విషయం వెలుగులోకి వస్తుంది.