జర్నలిస్టుల సమస్యలపై త్వరలో ఛలో విజయవాడ
VSP: రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం త్వరలో ‘ఛలో విజయవాడ’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఆంజనేయులు తెలిపారు. విశాఖ ప్రెస్క్లబ్లో శనివారం ఆయన మాట్లాడుతూ.. ఇళ్ల స్థలాలు, ఉచిత వైద్యం, పింఛన్, జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అందించాలన్నారు.