నేటితో ముగియనున్న గడువు
VSP: వీఏంఆర్డీఏ రూపొందించిన బృహత్ ప్రణాళికా-2041 పునఃపరిశీలనకు సంబందించి ప్రజల నుంచి అభిప్రాయాలు, సూచనల స్వీకరణ నేటితో ముగియనున్నట్లు వీఏంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. ప్రజలు తమ సూచనలను ఈరోజు సాయంత్రం 5 గంటలలోపు VMRDA కార్యాలయంలో లేదా www.vmrda.gov.in వెబ్సైట్ ద్వారా సమర్పించవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.