'పెత్తందారులపై కేసులు నమోదు చేయాలి'

'పెత్తందారులపై కేసులు నమోదు చేయాలి'

E.G: దళితులను సాంఘిక బహిష్కరణ చేసిన పెత్తందారులపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని తూ.గో జిల్లా KVPS ప్రధాన కార్యదర్శి జువ్వల రాంబాబు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా గుడ్లురు మండలం దప్పళంపాడు దళితులపై సామాజిక బహిష్కరణ చేసిన పెత్తందారులపై బుధవారం నిడదవోలులో KVPS నిరసన వ్యక్తం చేసింది. ఈ ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.