రఘనాథపల్లిలో గ్యాస్ సిలిండర్ దొంగతనం
JN: ఓ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు సిలిండర్ దొంగతనం చేసిన ఘటన రఘనాథపల్లిలో చోటుచేసుకుంది. మానుపాటి సోమలక్ష్మి.. ఇంటికి తాళం వేసి మంగళవారం తన బంధువుల ఇంటికి వెళ్లింది. నిన్న తన ఇంటి తలుపు తెరిచి ఉండడంతో స్థానికులు ఆమెకు సమాచారం అందించారు. ఇంట్లో ఆభరణాలు, డబ్బులు లేకపోవడంతో సిలిండర్ను తీసుకెళ్లినట్లు ఆమె తెలిపారు. భాదితురాలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేశారు.