ఓబులదేవలచెరువులో ఘనంగా ఈస్టర్ వేడుకలు

ఓబులదేవలచెరువులో ఘనంగా ఈస్టర్ వేడుకలు

సత్యసాయి: యేసు క్రీస్తు సిలువ వేయబడి తిరిగి లేచిన పునరుత్థాన దినాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలోని సీ అండ్ ఐజీ మిషన్ చర్చిలో ఈస్టర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చర్చిని పూలతో అలంకరించి క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యేసు లేచెను.. ఆదివారమున, జయ జయ యేసు జయ యేసు.. అంటూ ఈస్టర్ ప్రత్యేక గీతాలను ఆలపించారు. అనంతరం ఒకరికొకరు ఈస్టర్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.